రేపు వైఎస్ఆర్సీపీఎల్పీ సమావేశం

29 Aug, 2015 19:17 IST|Sakshi
రేపు వైఎస్ఆర్సీపీఎల్పీ సమావేశం

హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఆ పార్టీనేతలు సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు