ప్రవాస భారతీయుడికి రూ.17.5 కోట్ల లాటరీ

6 Feb, 2018 02:59 IST|Sakshi

దుబాయ్‌: అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది. అతని లాటరీ టికెట్‌కు సుమారు రూ.17.5 కోట్లు వచ్చాయి. కేరళకు చెందిన సునీల్‌ మప్పట్టా కృష్ణన్‌ కుట్టి నాయర్‌ లాటరీలో 10 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగదు మొత్తాన్ని నాయర్‌ తన ముగ్గురు స్నేహితులతో పంచుకోను న్నారని టికెట్‌ ధరలో కొంత మొత్తం ఇచ్చిన అతని కొలీగ్‌ తెలిపాడు. 

మరిన్ని వార్తలు