కొలంబో: నిషేధిత సంస్థ ఎల్టీటీఈకి చెందిన కీలక మహిళా నేతను కొలంబో ఎయిర్పోర్టులో శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఎల్టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది పారిస్ వెళ్లేందుకు యత్నించగా టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 2005లో ఫ్రాన్స్ వెళ్లిన ఆమె గత ఫిబ్రవరి 9న లంకకు వచ్చారు.