139వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

18 Apr, 2018 09:10 IST|Sakshi

సాక్షి, మైలవరం : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా మైలవరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ అక్కడ నుంచి చిన్న నందిగాం క్రాస్‌, వెల్వడం, గణపవరం అడ్డరోడ్‌, గణపవరం మీదగా నూజివీడు నియోజకవర్గంలోని శోభనాపురం క్రాస్‌ చేరుకుని అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ ఆయన 1,794.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

మరిన్ని వార్తలు