విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్లో సబ్ మెరైన్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 39 మంది అధికారులు, 621మంది నావికులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరేడ్ గ్రౌండ్కు విచ్చేసి పరేడ్ను తిలకించారు. గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా విచ్చేశారు. నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నౌకాదళంలో 1967 డిసెంబర్ 8న జలాంతర్గామి విభాగం ప్రారంభం కాగా తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి చేరింది.