పంజాబ్‌ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్‌

4 Nov, 2023 17:25 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్‌ దలాల్‌ మండిపడ్డారు.తాము పంజాబ్‌ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్‌ వేశారు.

మూడురోజులుగా పంజాబ్‌,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్‌ శనివారం ట్విటర్‌లో వెల్లడించారు.పంజాబ్‌లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు.

కాగా,దలాల్‌ ఆరోపణలపై పంజాబ్‌ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు