కరీంనగర్లో అఖిల్, సమంత..!

5 Jul, 2017 13:19 IST|Sakshi
కరీంనగర్లో అఖిల్, సమంత..!

అక్కినేని తారలు అఖిల్, సమంత కరీంనగర్లో సందడి చేశారు. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్న వీరు.. కొత్త మాల్ ఓపెనింగ్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 9.30కు జరిగిన ఓపెనింగ్ కార్యక్రమంలో అఖిల్, సమంతలు పాల్గొన్నారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తన వదిన సమంతతో కలిసి కరీంనగర్ లోని కొత్త సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించటం గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు అఖిల్. 11వ మాల్ ఓపెనింగ్ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సురేష్, అతని కుటుంబ సభ్యులకు అఖిల్ శుభాకాంక్షలు తెలిపాడు.