బాసూ.. మళ్లీ మాసు

1 Mar, 2019 01:00 IST|Sakshi
రజనీకాంత్‌

‘పేట’లో రజనీకాంత్‌ మేనరిజమ్‌కు తగ్గట్లు కేవ్వు కేక అనిపించే పాటలు అందించారు సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచంద్రన్‌. ఆ సినిమాలో ‘మరణమ్‌ మాసు మరణమ్‌..’ పాట సూపర్‌ హిట్‌. ఇప్పుడు రజనీ కోసం అనిరుథ్‌ మళ్లీ ఇలాంటి మాస్‌ పాటలివ్వడానికి రెడీ అయ్యారు. ఏఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుథ్‌ని సంగీతదర్శకుడిగా తీసుకున్నారు. బాసుకి మళ్లీ మాస్‌ పాటలివ్వాలంటూ తన టీమ్‌తో పని మొదలుపెట్టారట అనిరుథ్‌.

ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ రజనీకాంత్‌ సినిమాకు మ్యూజిక్‌ ఇచ్చే చాన్స్‌ కొట్టేసినందుకు అనిరుథ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం రజనీకాంత్‌ 90 రోజులు కాల్షీట్స్‌ను కేటాయించారని కోలీవుడ్‌ టాక్‌. ఇందులో రజనీకాంత్‌ డ్యూయెల్‌ రోల్‌ చేయబోతున్నారని, కథానాయికల పాత్ర కోసం టీమ్‌... నయనతార, కీర్తీసురేష్‌ లను సంప్రదించారని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇదిలా ఉంటే.. గతంలో రజనీకాంత్‌ సరసన కీర్తీ సురేష్‌ తల్లి మేనక కథానాయికగా నటించారు. ఇప్పుడు కూతురు జోడీగా నటించనుండటం విశేషం.

మరిన్ని వార్తలు