ప్రయాణం అద్భుతంగా సాగింది

19 Mar, 2019 01:03 IST|Sakshi
అరుణ్‌ విజయ్, సుజీత్

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న భారీ బడ్జైట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సాహో’. సుజీత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, అరుణ్‌ విజయ్, ఎవలీన్‌ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్‌ విజయ్‌ తన పార్ట్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు. ‘‘ఇలాంటి వండర్‌ఫుల్‌ టీమ్‌లో భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణాన్ని ఓ మంచి జ్ఞాపకంగా చేసినందుకు ప్రభాస్, సుజీత్, యూవీ క్రియేషన్స్‌ సంస్థ, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్‌. ఆగస్ట్‌ 15 నుంచి థియేటర్స్‌లో అద్భుతమైన అనుభూతిని పొందడానికి రెడీగా ఉండండి’’ అని అరుణ్‌ విజయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు