కొత్త నిర్మాతలకు తరగతులు

19 Nov, 2019 00:14 IST|Sakshi
అరవింద స్వామి, అమలాపాల్‌

‘‘ప్రస్తుతం మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ‘భాస్కర్‌ ఒక రాస్కెల్‌’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్ర నిర్మాణం పట్ల నూతన నిర్మాతలకు అవగాహన కల్పించడం కోసం నిర్మాత మండలి తరఫున తరగతులు నిర్వహిస్తున్నాం’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్‌. అరవింద స్వామి, అమలాపాల్‌ ప్రధాన పాత్రల్లో సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’.

ఈ చిత్రాన్ని ‘భాస్కర్‌ ఒక రాస్కెల్‌’ అనే పేరుతో కార్తికేయ మూవీస్‌ పతాకంపై పఠాన్‌ చాన్‌బాషా ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వి. సముద్ర, నిర్మాత దామోదర ప్రసాద్‌ విడుదల చేశారు. ‘‘కథా బలమే సినిమాకు ప్రాణం’’ అన్నారు సెన్సార్‌ బోర్డు సభ్యుడు వేణుగోపాల్‌ యాదవ్‌. ‘‘తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు? ఇందుకోసం ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది’’ అన్నారు పఠాన్‌ బాషా.

మరిన్ని వార్తలు