‘చిత్రలహరి’పై చిరు కామెంట్స్‌

15 Apr, 2019 15:45 IST|Sakshi

వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమైన మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు చిత్రలహరి కాస్త ఊరటనిచ్చినట్టు కనిపిస్తోంది. గత చిత్రాల కంటే ఈ సినిమా ఫర్వాలేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే చిత్రలహరిపై భిన్నాభిప్రాయాలు వస్తుండగా.. మూవీకి ప్రమోషన్‌ను కల్పించే క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలిపారు.

చిత్రలహరి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ చాలా చక్కగా, పరిణితితో నటించాడని, డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని చక్కగా రూపొందించారని, మైత్రి మూవీస్‌ సంస్థకు తగ్గట్టుగా ఈ సినిమాను వారు నిర్మించారని తెలిపారు. ఈ మూవీలో నటించిన మిగతా పాత్రల గురించి కూడా తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ మరోసారి తన సంగీతంతో సత్తా చాటారని కొనియాడారు.

మరిన్ని వార్తలు