హరీశ్ శంకర్‌కు కోపమొచ్చింది!

10 Mar, 2018 17:57 IST|Sakshi
డైరెక్టర్ హరీశ్ శంకర్‌

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు కోపమొచ్చింది. అయితే సినిమా, షూటింగ్‌ల విషయంలో మాత్రం కాదండోయ్. అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు హరీశ్ శంకర్ యాక్ట్ ఫైబర్‌నెట్‌ సేవల్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సర్వీస్ నిమిత్తం యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ను డైరెక్టర్ సంప్రదించారు. ఆయన ఇంటికి వచ్చేందుకు వివరాలు అడగగా.. హరీశ్ శంకర్ తన ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌ వివరాలు ఇచ్చారు. కానీ ఆయన అడ్రస్ కనుక్కోవడం ఆ సంస్థ సిబ్బందికి వీలుకాలేదు. దీంతో హరీశ్‌కు చిర్రెత్తుకొచ్చింది.

అడ్రస్ చెప్పండంటూ దాదాపు 10 మంది యాక్ట్‌ ఫైబర్‌నెట్ నుంచి ఫోన్‌ కాల్స్ చేశారు. రిజిస్టర్ చేసుకున్న నా మొబైల్ నెంబర్‌ను ఇచ్చినా అడ్రస్‌ కనుక్కోలేకపోతున్నారా.. పనులన్నీ వదిలేసి మీతో ఫోన్లు మాట్లాడేందుకు ఎంతమందికి ఇలా నా మొబైల్ నెంబర్‌ షేర్ చేయాలంటూ’ అసహనం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ దర్శకుడి ట్వీట్ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం నిర్మాత ‘దిల్‌’ రాజు బ్యానర్‌లో చేయనున్న ‘దాగుడుమూతలు’ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు హరీష్‌.
 

మరిన్ని వార్తలు