ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు!

1 Apr, 2015 23:00 IST|Sakshi
ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు!

 ‘ఏక్ దుజే కేలియే’ చిత్రంతో ఆనాటి కుర్రకారు మది దోచుకున్న నటి రతీ అగ్నిహోత్రి. కెరీర్ ఊపులో ఉండగానే ఏరికోరి పెళ్లాడిన అనిల్ విర్వానీ తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆమె ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. నేను అనుభవిస్తున్న నరకం ఏమిటో మా అబ్బాయికి తెలుసు. ‘నా కోసం కాదమ్మా...     నీ కోసం నువ్వు బతుకు’ అన్న మా వాడి మాటలే నాకు ధైర్యమిచ్చాయి’’ అని రతి కన్నీటి పర్యంతమయ్యారు.