హత్య చేసిందెవరు?

14 Sep, 2016 03:27 IST|Sakshi
హత్య చేసిందెవరు?

 జై, వసుంధర జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘హౌస్’. రాజుశెట్టి దర్శకత్వంలో బోయిన కృష్ణారావు నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్‌లో ఒక ఇంట్లో జరిగే కథ ఇది. ఎన్‌ఆర్‌ఐ అయిన హీరో ఓ పనిపై ఆ ఇంటి కొస్తాడు. ఆ ఇంటి ఓనరు హత్యకు గురవుతాడు. ఎవరు చంపారు? అనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యేలా సన్నివేశాలుంటాయి. అనంతగిరి హిల్స్‌లో పాటలను  చిత్రీకరించాం. ఈ నెలలో ఆడియో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మట్టి మహేశ్, సంగీతం: శశాంక్ భాస్కరుని.
 

>