-

తమ్ముడూ... ఇరానీ కేఫ్‌లో కుమ్ముడూ!

18 Jun, 2017 22:30 IST|Sakshi
తమ్ముడూ... ఇరానీ కేఫ్‌లో కుమ్ముడూ!

తమ్ముళ్లందరికీ గరమ్‌ గరమ్‌ ఛాయ్‌ తాగిద్దామని ఓ పహిల్వాన్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున అమీర్‌ పేట్‌లోని ఇరానీ కేఫ్‌కి తీసుకొచ్చాడు. కాసేపటికి అక్కడికి ఓ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు వచ్చాడు. చూపులకు కుర్రాడు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు. కానీ, ఛాయ్‌ కన్నా గరమ్‌గున్న అతడి కళ్లు ఎవర్నో వెతుకుతున్నాయి. కట్‌ చేస్తే... పహిల్వాన్‌తో పాటు తమ్ముళ్లను కుమ్మడం స్టార్ట్‌ చేశాడు. ఆ కుమ్ముతోంది పవన్‌కల్యాణ్‌. అతడి కుమ్ముడికి బలైంది విలన్లు.త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ సినిమాలో సై్టలిష్‌ ఫైట్‌ ఇలానే ఉంటుందట!

హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ సినిమా కోసం ఇరానీ కేఫ్‌ సెట్‌ వేశారు. ప్రస్తుతం ఆ సెట్‌లో పవన్‌పై తీస్తున్న ఫైట్‌ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతుందట. రెండు మూడ్రోజుల పాటు ఇరానీ కేఫ్‌లో షూటింగ్‌ చేస్తారట! హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. ‘అత్తారింటికి దారేది’లో సమంతను కొందరు కిడ్నాప్‌ చేసి, ఇరానీ కేఫ్‌కు తీసుకెళితే, అక్కడామె కిడ్నాపర్లకు పవన్‌ ఫ్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. ఇప్పుడీ సిన్మాలో ఇరానీ కేఫ్‌లో సీన్లు బదులు త్రివిక్రమ్‌ ఫైట్స్‌ పెట్టారన్న మాట!