12న కైకాల సినీ షష్టిపూర్తి

8 Feb, 2019 03:46 IST|Sakshi
కైకాల సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘వంశీ ఇంటర్నేషనల్‌’ సంస్థ ఈ నెల 12న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం నిర్వహించనుంది. ‘‘కైకాల సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నాం.

ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, రేలంగి నరసింహారావు తదితర ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 12 సాయంత్రం 5గంటలకు జరిగే ఈ వేడుకలో శివశంకరి గీతాంజలి సమర్పణలో సినీసంగీత విభావరి ఉంటుంది’’  అన్నారు ‘వంశీ’ వ్యవస్థాపకులు శిరోమణి డా. వంశీ రామరాజు.

మరిన్ని వార్తలు