వ్యాపార రంగంలోకి దర్శకుడి భార్య

24 Mar, 2018 12:23 IST|Sakshi
రూపా వైట్ల

సినీ రంగంలో ఉన్న వారు ఇప్పుడు ఇతర వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పబ్‌లు, రెస్టారెంట్‌ ల లాంటి వ్యాపారాల్లో అడుగుపెట్టారు. తాజాగా దర్శకుడు శ్రీనువైట్ల భార్య రూపా వైట్ల కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వేదిక్‌ పేరుతో వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల బిజినెస్‌ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్‌ ను హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా పేజ్‌లో వెల్లడించిన హీరోయిన్‌ కాజల్‌, వేదిక్‌ బ్రాండ్‌ ను లాంచ్‌ చేయటం ఆనందంగా ఉందన్నారు. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాకు రూపావైట్ల కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా వ్యవహరించారు. తాజాగా ఆమె వేదిక్ ఉత్పత్తులను లాంచ్‌ చేపినందుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు