వినగానే నచ్చేసింది – దేవిశ్రీ

13 Mar, 2018 01:02 IST|Sakshi
కొవెర, దేవిశ్రీ ప్రసాద్‌

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కొవెర దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ఉపశీర్షిక. కొవెర, హిమాన్షి కాంట్రగడ్డ జంటగా విజయలక్ష్మి కొండా నిర్మించిన ఈ చిత్రంలోని తొలి పాటను మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ విడుదల చేశారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘ఈ పాట చాలా ఆహ్లాదంగా ఉంది.

వినగానే నచ్చేసింది. ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్‌ అయి మ్యూజిక్‌ డైరెక్టర్‌ సత్య మహావీర్‌కి మంచి పేరు రావాలి. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘ సత్య మహావీర్‌ మంచి సంగీతం అందించి, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగిలిన పాటలని, సినిమా త్వరలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, స్క్రీన్‌ ప్లే రచయిత మధు పాల్గొన్నారు. ఈ సినిమాకి కెమెరా: రాకేశ్‌ గౌడ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివ నాగశివ గణపర్తి, మూర్తినాయుడు పాదం, సమర్పణ: నాగానిక.
∙కొవెర, దేవిశ్రీ ప్రసాద్‌

మరిన్ని వార్తలు