‘‘దర్శకుడు కొరటాల శివ తయారు చేసిన కథ నచ్చకపోవడంతో చిరంజీవి ఆయనతో చేయాలనుకున్న సినిమాని నిలిపివేశారు’’ అనే వార్త ప్రచారంలోకొచ్చింది. కొరటాలను చిరంజీవి వేరే కథ రెడీ చేయమన్నారనే వార్త కూడా వచ్చింది. ఆ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాయి నిర్మాణ సంస్థలు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘‘మా సినిమాకు కథ సిద్ధం అయింది. ప్రస్తుతం చిరంజీవిగారు ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు.