వెండితెరకు యంజీఆర్‌ జీవితం

6 Sep, 2018 00:29 IST|Sakshi
యంజీఆర్‌

తమిళనాట సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా యంజీర్‌ది స్ఫూర్తి కలిగించే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు దర్శకుడు ఎ.బాలకృష్ణన్‌. నటుడిగా, దర్శకుడిగా ఉన్నత స్థాన్నాన్ని అధిరోహించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు యంజీఆర్‌. ఓ నటుడు ముఖ్యమంత్రి కావడం భారతదేశంలోనే తొలిసారి. భారతరత్న అవార్డు అందుకున్నారాయన.

ఇలా ప్రస్థావించడానికి బోలెడు చరిత్ర ఉన్న బయోపిక్‌ ఇది. పాపులర్‌ టీవీ నటుడు సతీశ్‌ కుమార్‌ యంజీఆర్‌గా కనిపించనున్నారు. రైత్విక, వైయపురి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయాలను ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు. ‘మక్కల్‌ తిళగం’(జన నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. యంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా మణిరత్నం ‘ఇద్దరు’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు