వైఎస్ఆర్... మనసున్న నాయకుడు!

20 Feb, 2016 22:24 IST|Sakshi
వైఎస్ఆర్... మనసున్న నాయకుడు!

తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర  వేసి, చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపొందనుంది. విహారిక సమర్పణలో తయారు కానున్న ఈ చిత్రం పేరు ‘మనసున్న నాయకుడు’. సీనియర్ నటుడు సుమన్ ముఖ్య పాత్ర చేయనున్న ఈ చిత్రంలో నాయక్‌రెడ్డి, మాలిని కీలక పాత్రలు చేయనున్నారు.

 వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై మధురెడ్డి దర్శకత్వంలో ఆడారి రవికుమార్ దీన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మార్చి 14న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి, కడప, పులివెందుల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీనివాస కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బొత్స నాయుడు.
 

>