విగ్రహాల వేటలో...

10 May, 2015 00:22 IST|Sakshi
విగ్రహాల వేటలో...

12వ శతాబ్దానికి చెందిన చాలా విలువైన సీతారాముల విగ్రహాల కోసం అందరూ వెతుకుతుంటారు. అనుకోకుండా క్రిష్‌కు ఆ విగ్రహాలు దొరికాయి. వాటిని అతనేం చేశాడు...? ఆ విషయాలు తెలియాలంటే ‘మోసగాళ్లకు మోసగాడు’ చూడాల్సిందే.  సుధీర్‌బాబు, నందిని జంటగా  లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ- ‘‘12వ శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారు చేయించిన అతి విలువైన సీతారాముల విగ్రహాలను దొంగిలించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటనేది ఇతివృత్తం. ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్  ఖాద్రి, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీశ్ వేగేశ్న.
 

>