థ్రిల్‌కి గురి చేస్తుంది!

13 Oct, 2014 23:50 IST|Sakshi
థ్రిల్‌కి గురి చేస్తుంది!

నవదీప్ కథానాయకునిగా రూపొందించిన చిత్రం ‘నటుడు’. కావ్యాశెట్టి కథానాయిక. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ‘‘కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ‘దృశ్యం’, ‘గీతాంజలి’ చిత్రాల విజయాలే నిదర్శనాలు. మా సినిమా కూడా వాటి కోవకే చెందుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ... ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసే సినిమా ఇది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మానవసంబంధాలతో ఆడుకునే యువకుని కథ ఇదని, నవదీప్‌ని కొత్తగా ప్రెజెంట్ చేయడం జరిగిందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: జయసూర్య, సమర్పణ: కొప్పుల రాజేశ్వరీదేవి.