Sakshi News home page

Navdeep Drugs Case: డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ.. ఏకంగా 9 గంటలపాటు!

Published Tue, Oct 10 2023 8:14 PM

ED Enquiry Actor Navdeep Drugs Case Latest Update - Sakshi

డ్రగ్స్ కేసు విషయమై తెలుగు ప్రముఖ నటుడు నవదీప్‌‌ని ఈడీ విచారించడం ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయానికి వచ్చిన నవదీప్.. సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే దాదాపు 9 గంటల పాటు అతడిని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ గురించి.. అలానే డ్రగ్స్‌ అమ్మేవాళ్లతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్‌ బ్యాంకు ఖాతాల వివరాల గురించి విచారణలో అడిగినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే!)

ఇంతకీ ఏం జరిగింది?
గుడిమల్కాపూర్‌ పరిధిలో కొన్నిరోజులు క్రితం డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 10న  విచారణకు హాజరవ్వాలని నటుడు నవదీప్‌కి ఈడీ నోటీసులు జారీ చేసింది. పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ డ్రగ్‌ పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్‌ పేరు బయటపడింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్‌ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ అధికారులు ఏకంగా 9 గంటలు  విచారణ చేశారు.

(ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?)

Advertisement
Advertisement