నీతా అంబానీ తదితరులకు 'మనం' ప్రత్యేక ప్రదర్శన

16 Nov, 2014 14:14 IST|Sakshi
నీతా అంబానీ తదితరులకు 'మనం' ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్: భారత దేశంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థల అధినేత్రిలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను శనివారం సందర్శించారు.   అన్నపూర్ణ స్టూడియోలో సందర్శించిన వారిలో బాలీవుడ్ నటి జుహీ చావ్లా, రిలయన్స్ అధినేత్రి నీతా అంబానీ, స్వాతి పిరమిల్, నవాజ్ సింఘానియా, అనన్య గోయోంకాలు, లీనా తివారీ, రాధిక సేథ్, అనుప షెహ్నయ్ లున్నారు. 
 
అధినేత అక్కినేని నాగార్జున వారికి స్వాగతం పలికి.. అన్నపూర్ణ స్టూడియోలోని వివిధ విభాగాలను చూపించారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం 'మనం'ను మినీ థియేటర్ లో వారికి నాగార్జున ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. హుదూద్ బాధితులకు వారు 11 కోట్ల రూపాయల సహాయం అందించారు.