ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో నితిన్‌

6 Nov, 2017 20:06 IST|Sakshi

సాక్షి, సినిమా : చందమామ కథలు చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా పీఎస్‌వీ గరుడ వేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టాడు. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న సీనియర్ హీరో రాజశేఖర్‌కు కమ్‌ బ్యాక్‌ అని చెప్పుకుంటున్నారు. మరోపక్క సై-ఫై థ్రిల్లర్‌గా చిత్రాన్ని అద్భుతంగా మలిచాడంటూ దర్శకుడు ప్రవీణ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ప్రవీణ్ సత్తారు తన తర్వాతి చిత్రం యంగ్ హీరో నితిన్‌ తో చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలియజేశాడు. తన సొంత బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌లోనే ఈ చిత్రం ఉండబోతుందని.. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని నితిన్‌ పేర్కొన్నాడు.

కాగా, ప్రస్తుతం నితిన్‌ రౌడీ ఫెల్లో ఫేమ్‌ కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లు సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లై బ్యూటీ మేఘా ఆకాశ్‌ మరోసారి నితిన్‌ పక్కన మెరవనుంది.

మరిన్ని వార్తలు