నువ్వే నా బంగారం పాటలు

2 Dec, 2013 01:25 IST|Sakshi
నువ్వే నా బంగారం పాటలు

 ‘‘కొడుకులు, కూతుళ్లకన్నా.. మనవళ్లు, మనవరాళ్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే తన మనవడి కోసం కృష్ణంరాజు ఈ సినిమా తీశాడు. ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి, ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలా చేయండి’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. సాయికృష్ణ, షీనా జంటగా రామ్వెంకీ దర్శకత్వంలో పేరిచర్ల కృష్ణంరాజు నిర్మించిన చిత్రం ‘నువ్వే నా బంగారం’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను దాసరి ఆవిష్కరించి వీవీ వినాయక్కి ఇచ్చారు. ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయని, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని వినాయక్ అన్నారు. ఈ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానని నిర్మాత చెప్పారు. యూత్, ఫ్యామిలీకి నచ్చే అంశాలతో ఈ సినిమా చేశామని, ఫీల్ గుడ్ మూవీ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, వి.సాగర్, సుమన్, బెల్లంకొండ సురేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.