డేంజర్‌ జోన్‌

23 Feb, 2017 00:25 IST|Sakshi
డేంజర్‌ జోన్‌

ఆర్‌.జె.రూపేష్‌ శెట్టి, రమ్య జంటగా నటించిన చిత్రం ‘పిశాచి–2‘. డేంజర్‌ జోన్‌ అన్నది ఉపశీర్షిక. దేవరాజ్‌ కుమార్‌ దర్శకత్వంలో లయన్‌ సాయి వెంకట్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్‌ను నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్‌ విడుదల చే శారు.

‘‘ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది’’ అని అతిథులు అన్నారు. ‘‘ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాం. ‘పిశాచి 2’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అని సాయి వెంకట్‌ చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీనివాస్‌ రెడ్డి, తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ, సహ నిర్మాతలు: లయన్‌ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ.