ప్రేమ ప్రయాణం , ఆడియో ఫంక్షన్‌

4 Jul, 2013 02:38 IST|Sakshi
ప్రేమ ప్రయాణం , ఆడియో ఫంక్షన్‌
‘‘ఇటీవల ఏ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినా పాటలు బాగున్నా లేకున్నా బావున్నాయనే చెప్పాల్సి వస్తోంది. కానీ ఈ సినిమా పాటలు నా మనసుకు హత్తుకున్నాయి’’ అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. మనోజ్ నందం, నీతూ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ ప్రయాణం’. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు. కె.మస్తాన్‌వలి నిర్మాత. ఎలేందర్ బైగళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సుమన్‌కి అందించారు. శ్రీహరి ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ తరువాత మనోజ్ చాలా సినిమాలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.