యువతకు సందేశం

17 Feb, 2014 08:37 IST|Sakshi
యువతకు సందేశం
 ‘ప్రేమిస్తే’ లాంటి ప్రేమకథా చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి, ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఆయన అందిస్తున్న పదవచిత్రం ‘ప్రేమించాలి’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు వీధులపాలవుతున్న సంఘటనలను వింటున్నాం.. చూస్తున్నాం. అసలు పిల్లలు అలా వీధులపాలవడానికి కారణం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథకు సెన్సార్ బోర్డ్  యు సర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమా అనీ ప్రేక్షకుల కంట తడిపెట్టించే సినిమా అని భాస్కరభట్ల తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని సురేష్‌తో కలిసి ‘పిజ్జా’ చిత్రాన్ని విడుదల చేసిన సమన్యరెడ్డి అన్నారు.