ఐటీ సోదాలపై స్పందించిన కళ్యాణ్‌

17 Jan, 2018 17:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ స్పందించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని చెప్పారు. తన కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించిన మాట వాస్తమేనని వెల్లడించారు. కొత్త సినిమా విడుదలైన ప్రతీసారి ఐటీ అధికారులు వస్తారని వ్యాఖ్యానించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన నిర్మించిన ‘జై సింహా’ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ నిర్మించిన ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు)కు చెందిన హారికా హాసిని క్రియేషన్స్ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు జరిగాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌, భవ్య క్రియేషన్స్‌, డీవీవీ క్రియేషన్స్, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాంటి ఎనిమిది నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు