కుమార్ బాబు కోసం చిట్టిబాబు

22 Aug, 2018 12:59 IST|Sakshi

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.  రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన అదే కంగల్‌ (అవే కళ్లు) సినిమా ఆధారంగా నీవెవరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా  కామెడీ ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు