ఓటు వేయలేక పోతున్నాను : రామ్‌చరణ్‌

7 Dec, 2018 17:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయం గురించి రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌లో ‘కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి’ అంటూ పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా రామ్‌చరణ్‌ సతీమణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం. ప్రతి ఓటు కౌంటబుల్‌ అవుతుంది. ఓటే మన భవిష్యత్‌ని నిర్ణయిస్తుందనీ.. అందరూ తప్పక ఓటు వేయాలి’ అంటూ ఉపాసన ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు