దిశ ఘటనపై సినిమా తీస్తున్నా

2 Feb, 2020 00:46 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ

నిర్భయ సంఘటన తర్వాత ఇటీవల జరిగిన దిశా అత్యాచారం ఘటన దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు దిశా ఘటనపై సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘దిశా ఘటనలో దిశా శరీరాన్ని పెట్రోల్‌తో కాల్చేసి దారుణానికి పాల్పడ్డారు రేపిస్టులు. ఆ రేప్‌ చేసినవాళ్ల మానసిక స్థితి ఏంటి? దిశను ఎందుకు చంపారు? అని ఈ సినిమాలో చూపించబోతున్నాను. రేపిస్టులందరూ గతంలో జరిగిన రేప్‌ కేసుల్లో జరిగిన తప్పులు చేయకూడదనుకుంటున్నారు కానీ మానభంగం చేయకూడదు అని మాత్రం అనుకోవడం లేదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు