రీమేక్‌ను పక్కన పెట్టేసిన మాస్‌ మహరాజ్‌

1 Nov, 2017 15:46 IST|Sakshi

రెండేళ్ల విరామం తరువాత బ్లాక్‌ బస్టర్‌సక్సెస్‌ తో రీ ఎంట్రీ ఇచ్చాడు మాస్‌ మహరాజ్‌ రవితేజ. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్‌ సినిమాతో మరోసారి తన  స్టామినా ఏంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వరుస సినిమాలకురెడీ  అవుతున్నాడు రవితేజ. ఇప్పటికే టచ్‌ చేసి చూడు సెట్స్‌మీద ఉండగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సూపర్‌ హిట్‌ భోగన్‌ను రవితేజ హీరోగా తెలుగులో రీమేక్‌ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా రవితేజ ఈ రీమేక్‌ను తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ్‌లో జయం రవి, అరవింద్‌ స్వామిలు ప్రధాన పాత్రల్లో తెరకకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌ లో భారీ వసూళ్లు సాదించింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో జయం రవి పాత్రకు రవితేజను తీసుకున్నారు. కానీ అరవింద్‌ స్వామి పాత్రకు సరైన నటుడు కుదరకపోవటంతో రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ పై అధికారిక సమాచారం లేకపోయినా.. టచ్‌ చేసి చూడు సినిమా తరువాత రవితేజ శ్రీనువైట్ల సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడట.

మరిన్ని వార్తలు