'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు

1 Apr, 2014 13:48 IST|Sakshi
'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు
చెన్నై: 'రౌడీ' చిత్రం పూర్తి స్థాయి నటుడిగా మార్చిందని టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల కాలంలో ఓ మోస్తారు విజయాలను తన ఖాతాలో వేసుకున్న విష్ణు.. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'రౌడీ' చిత్రంలో తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తున్నారు. 
 
'చాలా కాలం తర్వాత కామెడీ లేకుండా ఓ సీరియస్ చిత్రంలో నటించాను.  పూర్తి స్థాయి నటుడిననే సంతృప్తి కలిగించింది. కమర్షియల్ హంగులతోపాటు ఈ చిత్రంలో ఉద్వేగానికి గురి చేసే సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నాలో ఉన్న నటుడిని రాము వెలికి తీశారు' అని విష్ణు తెలిపారు. 
 
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన 'రౌడీ' చిత్రంలో మోహన్ బాబు, జయసుధ, శాన్వీ శ్రీవాస్తవ్, వెన్నెల కిషోర్, రవి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4 తేదిన విడుదల కానుంది.