చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో డైలామాలో పడ్డాడు అక్కినేని యువ హీరో అఖిల్. ‘మిస్టర్ మజ్ను’తో ఎలాగైనా హిట్కొట్టాలని ప్రయత్నించగా.. ఆశించిన విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. ఇక అఖిల్ నాల్గో సినిమాపై ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.
అఖిల్ నాల్లో సినిమా శ్రీనువైట్లతో ఉంటుందని రూమర్స్ వినిపించగా.. మళ్లీ మలుపు దర్శకుడు సత్య పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న పేరు క్రిష్. అవును.. నాగ్కు ఈ మధ్యేకథ వినిపించాడని.. అది నచ్చడంతో అఖిల్తో సినిమా దాదాపుగా ఫిక్స్ చేసినట్టే అనే టాక్ వినిపిస్తోంది. అసలే క్రిష్ మణికర్ణిక వివాదం, మహానాయకుడు మూవీతో సతమతమవుతుంటే.. మరి ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.