చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం | Sakshi
Sakshi News home page

చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం

Published Fri, Feb 1 2019 8:17 PM

Leopard Attack On People In Jalandhar - Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్‌ గన్‌ను ఉపయోగించి చిరుతను అదుపు చేయడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పారిపోయిన ఈ చిరుత అటవీ మార్గం గుండా జలంధర్‌ చేరుకుని ఉంటుందని పంజాబ్‌ అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వల వేసి పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదని.. అందుకే మత్తులో దించి దానిని బంధించినట్లు తెలిపారు. అనంతరం చాట్‌బిర్‌ జూకు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement