సందేశంతో...

12 Oct, 2016 23:29 IST|Sakshi
సందేశంతో...

పవన్, ప్రియ స్వీటీ జంటగా బేబీ మోక్ష ప్రత్యేక పాత్రలో రాజేష్ యడమను దర్శకునిగా పరిచయం చేస్తూ త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ పతాకంపై యస్. త్రివిక్రమ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘దర్శకత్వ శాఖలో ఆరేళ్లుగా ఉన్న నాకు ఇది మంచి అవకాశం. చక్కటి ప్రేమకథా చిత్రమిది. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం అమ్మాయి చేయి వదిలి పెట్టకూడదనే విషయాన్ని చెప్పనున్నాం’’ అన్నారు.

‘‘డాక్టర్ అయిన నేను సినిమాలపై ఉన్న ఇష్టంతోనే ఈ రంగానికి వచ్చా. ప్రేమను తెలిపే విధానం వేరుగా ఉన్నా ప్రేమ భావం ఒక్కటే అన్నది కథాంశం. యువతకి మా చిత్రం ద్వారా చక్కటి సందేశం ఇవ్వబోతున్నాం’’ అని నిర్మాత చెప్పారు.