టాలీవుడ్‌పై కన్నేసిన ఎయిర్‌టెల్‌ భామ

12 Feb, 2018 11:18 IST|Sakshi
సషా చెట్రీ

సాక్షి, హైదరాబాద్‌ : ఎయిర్‌టెల్‌ 4జీ యాడ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సషా చెట్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. వినాయకుడు, కేరింత సినిమాల దర్శకుడు సాయి కిరణ్ అడవి మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. చిత్రంలోని పాత్రల్లో ఫ్రేష్‌ లుక్ కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట. దీనికోసం జరిపిన ఆడిషన్‌లలో సాషా యాక్టింగ్‌ స్కిల్స్‌, డైలాగ్ డెలివరీతో డైరెక్టర్‌ ఇంప్రెస్‌ అయినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన ఈ 19 ఏళ్ల ముద్దుగుమ్మ మోడల్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2015 ఆగష్టులో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ప్రచార యాడ్‌లో సషాకు అవకాశం రావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని వార్తలు