త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’

20 Nov, 2018 15:58 IST|Sakshi

శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో శరత్‌ నర్వాడే దర్శకత్వంలతో తెరకెక్కుతున్న సినిమా ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో ఆడియన్స్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో పుష్యమి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సంద‌ర్భంగా సినిమా రెండో ట్రైల‌ర్‌ను స్టార్ డైరెక్టర్ త్రిమిక్రమ్ శ్రీ‌నివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవ‌లె విడుద‌లైన మా ట్రైల‌ర్, టీజ‌ర్‌లకి ఇంత అద్భుత‌మైన స్పంద‌న ల‌భించడం చాలా ఆనందంగా ఉంది. ఇండ‌స్ర్టీలో ఉన్న పెద్దలంద‌రూ చూసి అభినందించారు.

ఇంత మంది ప్రముఖుల ఆద‌ర‌ణ ఈ సినిమాకి ల‌భించ‌డం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైల‌ర్‌ని మేము అడిగిన వెంట‌నే త్రివిక్రమ్‌గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషం ఆయ‌న‌కు మా ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత‌లు విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధన్‌, బెల్లం కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు