మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్చరణ్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది.
భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పని చేస్తున్నారు. స్కైఫాల్, హ్యారీపొటర్ సిరీస్లకు యాక్షన్ డైరెక్టర్గా పనిచేసిన గ్రెగ్ పావెల్ సైరా సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, యాక్షన్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పావెల్ల ఫొటోను ట్వీట్ చేసిన బ్రహ్మాజీ సైరా మూమెంట్, యాక్షన్ బిగిన్స్ అంటూ ట్వీట్ చేశారు.
#syeraa #syeramoment #actionbegins #gregpowel… https://t.co/nTmbYdfi4H
— BRAHMAJI (@actorbrahmaji) 12 June 2018