డెంగీతో ఆసుపత్రిలో చేరిన కమెడియన్‌

1 Sep, 2017 12:32 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ సునీల్‌ గ్రోవర్‌ గురువారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా.. డెంగీ సోకినట్లు తెలిసింది.

ప్రస్తుతం గ్రోవర్‌ ఆసియన్‌ గుండె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. గత కొద్ది రోజులుగా గ్రోవర్‌ దేశ వ్యాప్తంగా షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తొందరగా కోలుకోవాలని కోరకుందాం.

>