తీయని కలవో...

23 Apr, 2014 23:14 IST|Sakshi
తీయని కలవో...

అందరి మనసులకూ హత్తుకునే తీయని కలలాంటి ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు శివాజీ.యు పేర్కొన్నారు. అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ముఖ్య తారలుగా బలమూరి రామమోహన్‌రావు నిర్మించిన ‘తీయని కలవో’ పాటల ఆవిష్కరణ హైరదాబాద్‌లో జరిగింది. పాటల సీడీని హీరోలు సుధీర్‌బాబు, నవీన్‌చంద్ర ఆవిష్కరించి దర్శకుడు శ్రీవాస్‌కి అందించారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు శివాజీ ఇంతకు ముందు నృత్య దర్శకునిగా చేశాడు. సినిమాను స్టయిలిష్‌గా తీశాడనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీశాడని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో దామోదర్‌ప్రసాద్, శివాజీరాజా, సాయికార్తీక్, ధన్‌రాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు పాలుపంచుకున్నారు.