మామ యజమాని... అల్లుడు ఆఫీసర్‌

24 Feb, 2019 00:48 IST|Sakshi

‘వెంకీమామ’ హంగామానేటి నుంచి ప్రారంభం కానుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో వెంకటేష్‌కు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించనున్నారు.

నిజ జీవితంలో మాదిరిగానే ఈ సినిమాలోనూ మామా అల్లుళ్లుగా కనిపించనున్నారు వెంకీ అండ్‌ చైతన్య. ‘‘ఫస్ట్‌ షెడ్యూల్‌ను ఇవాళ మొదలుపెడుతున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఓ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో వెంకీ, ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో నాగచైతన్య నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు