జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఒక అడుగు ముందుకేశాడు. వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం తన వంతు సాయాన్ని చేసి.. అందర్నీ సాయం చేయమని అడిగాడు.
తను ఎంత మొత్తాన్ని సాయం చేశాడన్నది తెలియకుండా చేసి.. దానికి సంబంధించిన సర్టిఫికేట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు . అందరి కంటే విజయ్ దేవరకొండ ప్రత్యేకమని ఇలాంటి సందర్బాల్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. మరి ఎంతమంది స్పందించి తమ వంతు సాయాన్ని అందిస్తారో చూడాలి.
They protect our families.
We must stand by the families of our soldiers.No contribution can be substantial for our soldiers' lives, but we have to do our bit, I've done mine.
Together let's Contribute, together we will create a support system.https://t.co/pHp7ITOdit pic.twitter.com/G9ztDj0gvI
— Vijay Deverakonda (@TheDeverakonda) February 15, 2019