బాలికపై పూజారి అత్యాచారం.. హత్య

21 Jun, 2014 14:46 IST|Sakshi

పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ప్రసాదం ఇస్తానని చెప్పి ఆశపెట్టి తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ ఆలయ పూజారి అత్యాచారం చేసి, తర్వాత ఆమెను పీకపిసికి చంపేశాడు! బర్ద్వాన్ జిల్లాలో జరిగిన ఈ కేసులో పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. రెండోతరగతి చదువుతున్న ఆ బాలిక ఆలయ ప్రాంగణంలో పూలు కోసుకోడానికి వచ్చింది. సౌత్ బజార్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి ధర్మకర్తగా కూడా ఉన్న ఆ పూజారి ఆ చిన్నారిని ఆలయం పైభాగంలోకి తీసుకెళ్లి అక్కడే అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను పీకపిసికి చంపి.. కిందకు తోసేశాడు.

ఏదో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు పరుగున అక్కడకు రాగా, అప్పటికే ఒంటినిండా తీవ్రగాయాలున్న బాలిక మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు తెలియజేయడంతో అసాసోల్-దుర్గాపూర్ కమిషనర్ వినీత్ గోయల్, ఏసీపీ పంకజ్ ద్వివేది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో పూజారితో పాటు ఓ కూరగాయల వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు గోయల్ తెలిపారు.

మరిన్ని వార్తలు