ఏపీ వాదనను తోసిపుచ్చిన ఎన్జీటీ

9 Dec, 2015 13:32 IST|Sakshi
ఏపీ వాదనను తోసిపుచ్చిన ఎన్జీటీ

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై దాఖలైన కేసును నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది‌. రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయన్న ఏపీ వాదనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఎన్జీటీ ఈ కేసు విచారణను  చేపట్టింది. ఏపీ, పిటిషనర్ తరపు వాదనలు విన్న అనంతరం కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది‌.

మరిన్ని వార్తలు