సిప్కాట్(తమిళనాడు), న్యూస్లైన్: తమిళనాడు సరిహద్దులోని అత్తిపల్లి వద్ద గురువారం సాయంత్రం బెంగళూరు మెట్రో బస్సుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. అయి తే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదని అధికారులు తెలిపారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన మెట్రోబస్సు 40 మంది ప్రయాణికులతో అత్తిపల్లి నుంచి సర్జాపురానికి బయల్దేరింది. మార్గం మధ్యలో బిదరగుప్ప గ్రామం వద్ద బస్సు యాక్జిల్ విరిగి మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అప్రత్తమైన బస్సు డ్రైవర్ వాహనాన్ని నిలిపేశాడు. దీంతో ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డారు.