జయతో అభ్యర్థుల భేటీ

28 Feb, 2014 01:19 IST|Sakshi

 టీనగర్, న్యూస్‌లైన్: పుదుచ్చేరి, రాష్ట్రం లోని 40 నియోజకవర్గాల అన్నాడీఎంకే అభ్యర్థులు ముఖ్యమంత్రి జయలలితతో సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. 24వ తేదీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలైంది. అన్నాడీఎంకే కూటమిలోగల కమ్యూనిస్టు పార్టీలకు ఏయే స్థానాలు అనే విషయం ఇంకా నిర్ణయించలేదు. ఇలా ఉండగా పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాలకు అన్నాడీఎంకే అభ్యర్థులు ప్రకటించబడ్డారు. ఈ 40 మంది ముఖ్యమంత్రి జయలలితను గురువారం సచివాలయంలో కలుసుకున్నారు. మొదట్లో ఈ సమావేశం అన్నాడీఎంకే కార్యాలయంలో జరుగుతుందని ప్రకటించారు. అయితే సచివాలయంలో 40 మంది అభ్యర్థులు జయలలితను కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ విధం గా వ్యవహరించాలి, ఎటువంటి విషయాలపై మాట్లాడాలి అనే విషయంపై అభ్యర్థులతో జయలలిత చర్చించినట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు